రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో పాల్గొన్న భీంపల్లి శ్రీకాంత్
మహబూబ్‌నగర్ సాంస్కృతిక విభాగం : తంగిరాల మెమోరియల్ ట్రస్ట్, సాహితీ కిరణం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో జిల్లాకు చెందిన యువకవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు. నాటకరంగం అభివృద్ధి అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనంలో భీంపల్లి శ్రీకాం త్ కళ తప్పిన పల్లె అనే కవితను చదివి సభికులను అలరించారు. అనంతరం సభకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ.రమణాచారి, ఆచార్య టి.గౌరిశంకర్, నేటి నిజం పత్రిక సంపాదకులు బైన దేదవాసు, జీవీఆర్. ఆరాధన కల్చరల్ పౌండేషన్ చైర్మన్ గుదిబండి వెంకట్‌రెడ్డి, సా హితీ కిరణం పత్రికా సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, తంగిరాల మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తంగిరాల చక్రవర్తి, పె ద్దూరి వెంకటదాసులు భీంపల్లి శ్రీకాంత్‌కు శాలువా, మెమెం టో, ప్రశంసాపత్రంతో సన్మానించారు.

9/26/2017 1:55:39 AM MAHBOOBNAGAR NEWS

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి